janathamirror.com

www.janathamirror.com

Sunday 30 May 2021

వై.యస్.జగన్ ప్రజా పాలనకు రెండేళ్లు

                                                           నందిగామ టౌన్ :


వై.యస్.జగన్ ప్రజా పాలనకు రెండేళ్లు ...ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.


సరికొత్త సంక్షేమాఅభివృద్ధి తో శకాన్ని ఆవిష్కరించిన వైయస్ జగన్ ..


రెండేళ్లలో విప్లవాత్మక పథకాలు ,కార్యక్రమాలు ..


ప్రజల గడప వద్దకే పారదర్శక పాలన ..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయి ,మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు ,


ముందుగా మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి శాసనసభ్యుడు డా"మొండితోక జగన్ మోహన్ రావు గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ,కార్యాలయ ఆవరణలో పార్టీ పతాకాన్ని ఎగరవేశారు ,అనంతరం పార్టీ కార్యాలయంలో నాయకులు- కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ,


ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా"మొండితోక జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ వైయస్ జగన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను ,హామీలను నెరవేర్చి - ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల కాలంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని ,ఈ రెండేళ్లలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో వైయస్ జగన్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు ..


ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...