బాపట్ల మెడికల్ కళాశాల, టీచింగ్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వినూత్నంగా చేపట్టారు.
బాపట్ల నియోజకవర్గం లో ఉన్న ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం మొదలగు పార్టీలు నాయకుల ఇంచార్జి లను,నాయకులను ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడమే కాకుండా, పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్, వ్యక్తిగత కార్యదర్శి కర్లపాలెం కిషోర్ ని పంపించి వారికి స్వయంగా ఆహ్వానం పంపి వారిని రేపు జరిగే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ పద్ధతి గతంలో బాపట్లలో ఎప్పుడు చూడనటువంటిది. అలాంటి ఒక వినూత్నమైనటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా ఒక మంచి సంస్కృతికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అని పలువురు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా అలాంటి మంచి సంస్కృతి బాపట్ల మెడికల్ కళాశాల శంకుస్థాపన ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
No comments:
Post a Comment