ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన...పౌరసరఫరాలు,వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి
మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ఆంక్షల కారణంగా పేదలు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశ్యంతో 16 విడతలుగా నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరోసారి ఉచితంగా మే, జూన్ నెలల్లో నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి 10 కేజీలు చొప్పున పంపిణీ చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
గత మే నెల్లో విజయనగరం జిల్లాలో 6 లక్షల 51 వేల 437 కుటుంబాలకు, శ్రీకాకుళం జిల్లాలో 7 లక్షల 48 వేల 725 కుటుంబాలకు, విశాఖపట్నం జిల్లాలో 11 లక్షల 60 వేల 025 కుటుంబాలకు, పశ్చిమగోదావరి జిల్లాలో 11 లక్షల 31 వేల 357 కుటుంబాలకు, వైఎస్సార్ కడప జిల్లాలో 7 లక్షల 40 వేల 177 కుటుంబాలకు, తూర్పుగోదావరి జిల్లాలో 14 లక్షల 91 వేల 117 కుటుంబాలకు, అనంతపూర్ జిల్లాలో 10 లక్షల 95 వేల 688 కుటుంబాలకు, చిత్తూరు జిల్లాలో 10 లక్షల 31 వేల 387 కుటుంబాలకు, కర్నూలు జిల్లాలో 10 లక్షల 77 వేల 331 కుటుంబాలకు, ప్రకాశం జిల్లాలో 8 లక్షల 80 వేల 178 కుటుంబాలకు, నెల్లూరు జిల్లాలో 7 లక్షల 80 వేల 106 కుటుంబాలకు, కృష్ణాజిల్లాలో 11 లక్షల 36 వేల 283 కుటుంబాలకు, గుంటూరు జిల్లాలో 12 లక్షల 92 వేల 078 కుటుంబాలకు ఉ చితంగా బియ్యాన్ని పంపిణీ చేసినట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.
No comments:
Post a Comment