Skip to main content

CM Jaganmohan Reddy's work for the progress of the state and the welfare of the people...Minister Kodali Nani

  రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహనరెడ్డి కృషి

గుడివాడ, జూన్ 2: రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం గుడివాడ పట్టణంలోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన నీలా ఎలక్ట్రానిక్స్ ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ముందుగా పాస్టర్ కృపానిధి ప్రార్ధనలు నిర్వహించి దేవుని వాక్యాన్ని అందించారు. 

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడలో గత 30 ఏళ్ళుగా నీలా ఎలక్ట్రానిక్స్ అధినేత రేవల్లి నీలాకాంత్ హెూమ్ అప్లయెన్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్ ద్వారా ఖాతాదారులకు నాణ్యమైన సేవలను అందిస్తూ వస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో క్యాంప్ కార్యాలయం సమీపంలో నీలా ఎలక్ట్రానిక్స్ షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ షోరూం ద్వారా మొబైల్ ఫోన్స్ సేల్స్ అండ్ సర్వీస్ ను కూడా అందిస్తున్నారని చెప్పారు. సెల్ ఫోన్ రంగంలో పూర్తి నైపుణ్యం కల్గిన నీలాకాంత్ ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. 

ఇదిలా ఉండగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరించానని చెప్పారు. ఆ సందర్భంగా 2008 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన శ్రీసిటీలోని రాక్వర్, రైజింగ్ స్టార్ మొబైల్స్ (ఫ్యాక్స్ కాన్) పరిశ్రమను సందర్శించానని తెలిపారు. ఫ్యాక్స్ కాన్ పరిశ్రమలో రాష్ట్ర నలుమూలలకు చెందిన మహిళా కార్మికులు కూడా పనిచేస్తున్నారని, వీరంతా పెద్దఎత్తున మొబైల్స్ ను తయారు చేస్తున్నారని వివరించారు. శ్రీసిటీలో 28 దేశాలకు చెందిన 190 పరిశ్రమలు ఉన్నాయని, వీటిలో 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, 50 శాతం మహిళలకు కేటాయించారని తెలిపారు. గత రెండేళ్ళుగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. సులభతర వ్యాపారంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయికి సీఎం జగన్మోహనరెడ్డి తీసుకువచ్చారని మంత్రి కొడాలి నాని తెలిపారు. 

అనంతరం మంత్రి కొడాలి నానిని నీలా ఎలక్ట్రానిక్స్ అధినేత రేమల్లి నీలాకాంత్ (పసి), కుటుంబ సభ్యులు మాజీ కౌన్సిలర్ రేమల్లి ప్రబోధారాణి, నిఖిత, పాల్ స్టీవెన్ పుష్పగుచ్ఛాలను అందజేసి దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, నాయకులు వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, మాదాసు వెంకట లక్ష్మీకుమారి, జ్యోతుల సత్యవేణి, పెనుమూడి రమేష్, రావులకొల్లు సుబ్రహ్మణ్యం, అల్లం రామ్మోహన్, తాళ్ళూరి ప్రశాంత్ రాజ్, బెజవాడ వెంకట రాంప్రసాద్, చుండూరి శేఖర్, కొలుసు నరేంద్ర, గుమ్మడి నాగేంద్ర, వెంపటి సైమన్, తులిమిల్లి యేషయ్య, మట్టా జాన్ విక్టర్, కడియాల గణేష్, సయ్యద్ గఫార్, అద్దేపల్లి పురుషోత్తం, అలంకార్ శేఖర్, అద్దేపల్లి హరిహరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

CPAP for Sleep Apnea: How It Works, Benefits, and What You Need to Know

  What is Sleep Apnea and Why Is It Dangerous? Sleep apnea is a serious medical condition in which breathing repeatedly stops and starts while you sleep. The most common type, Obstructive Sleep Apnea (OSA) , happens when the muscles in your throat relax too much, causing a blockage in your airway. This interruption in breathing can occur hundreds of times a night without you realizing it. Sleep apnea affects both men and women and is often underdiagnosed. If left untreated, it can lead to dangerous complications including high blood pressure , heart disease , stroke , diabetes , and severe daytime fatigue . Many people suffering from sleep apnea also experience loud snoring , choking during sleep , morning headaches , and poor concentration during the day . Fortunately, there’s an effective, non-invasive solution: CPAP therapy .  What is a CPAP Machine and How Does It Work? CPAP stands for Continuous Positive Airway Pressure . It’s a medical device designed to keep your ...

ఎన్.టి.ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 275

  ఎన్.టి.ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 275  1మనదేశం (24-11-1949)  2షావుకారు (07-04-1950)  3 పల్లెటూరిపిల్ల (27-04-1950)  4 మాయారంభ (22-09-1950)  5 సంసారం  (29-12-1950)  6 పాతాళభైరవి (15-03-1951)  7 మల్లీశ్వరి (20-12-1951)  8 పెళ్ళి చేసి చూడు (29-02-1952)  9 పల్లెటూరు (16-10-1952) 10 దాసి (26-11-1952) 11. అమ్మలక్కలు (12-03-1953) 12. పిచ్చిపుల్లయ్య (17-07-1953) 13. చండీరాణి  (28-08-1953) 14. చంద్రహారం (06-01-1954)  15. వద్దంటేడబ్బు (19-02-1954)  16. తోడుదొంగలు (15-04-1954) 17. రాజూపేద (25-06-1954)  18. సంఘం (10-07-1954)  19. అగ్గిరాముడు (05-08-1954) 20. పరివర్తన (01-09-1954) 21. ఇద్దరు పెళ్ళాలు (06-10-1954) 22. మిస్సమ్మ (12-01-1955)  23. రేచుక్క (25-03-1955)  24. విజయగౌరి (30-06-1955)  25. చెరపకురా చెడేవు (06-07-1955) 26. కన్యాశుల్కం (26-08-1955) 27. జయసింహ (21-10-1955)  28. సంతోషం (24-12-1955) 29. తెనాలి రామకృష్ణ (12-01-1956) 30. చింతామణి (11-04-1956)  31. జయం మనదే (04-05-195...

The state government will stand by the children who lost their parents with Covid ... Government whip Samineni Udaya bhanu

కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది... ప్రభుత్వ విప్ సామినేని  కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను,జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ అన్నారు. మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో జగ్గయ్యపేట పట్టణంలోని సత్యనారాయణపురం కు చెందిన షేక్ ఖలీల్, రేష్మా దంపతులు కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన వారి ఇద్దరు చిన్నారులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ. 20 లక్షల రూపాయల పరిహార ధ్రువీకరణ పత్రాలను కృష్ణాజిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు అందజేశారు.  అదేవిధంగా పెనుగంచిప్రోలు మండలంలోని కొల్లికుళ్ళ గ్రామానికి చెందిన రైతు గుమ్మ యలమంచయ్య ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ. 7 లక్షల రూపాయల పరిహారాన్ని ఆయన భార్య గుమ్మ నాగమణి కు కృష్ణ...