కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది... ప్రభుత్వ విప్ సామినేని
కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను,జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ అన్నారు. మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో జగ్గయ్యపేట పట్టణంలోని సత్యనారాయణపురం కు చెందిన షేక్ ఖలీల్, రేష్మా దంపతులు కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన వారి ఇద్దరు చిన్నారులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ. 20 లక్షల రూపాయల పరిహార ధ్రువీకరణ పత్రాలను కృష్ణాజిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు అందజేశారు.
అదేవిధంగా పెనుగంచిప్రోలు మండలంలోని కొల్లికుళ్ళ గ్రామానికి చెందిన రైతు గుమ్మ యలమంచయ్య ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ. 7 లక్షల రూపాయల పరిహారాన్ని ఆయన భార్య గుమ్మ నాగమణి కు కృష్ణాజిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ , రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అందజేశారు
No comments:
Post a Comment